Addasaram (Adathoda Vasika) is a wonderful Ayurvedic plant that fights the mosquito borne diseases. It has also capacity to control mosquitoes.It can be easily propogatable.It is introduced to me by Dr.Suresh Jakotia, an Ayurvedic doctor.
The multiple advantages of Addasaram plant are as follows:
1.Addasaram leaves act as a repellant.When the Addasaram plants in large number is planted in the backyard park of Khammam municipal Corporation, not even a single mosquito is existing in office premises.
Simultaneous , about 1, 50, 000 stumps of Addasaram was distributed incity of khammam.(stumps can be regenarated as plant, as in case of Rose).On growing,
It gave very good results of decreasing
mosquitoes.
2.Addasaram leaves also acts as Larvicide.Whenthe leaves are crushed and left In to the stagnant waters in right proportion, it kills the mosquitoe larvas.it was tested in suryapet.In Khammam , it was tested in presence of District Malaria officer sri.Rambabu.
Mitigating climate change with addasaram:
Mosqitoes are one of the major reason for pollution and consumption.Addasaram can control Mosqitoes and mosquito borne diseases. Thus, it can control climate change.
2.It also cures other diseases and minimises the medicines.
3.water purification capacity also stops the pollution of water.
దోమలను మరియు దోమల ద్వారా సంక్రమించే వ్యాదులను నియంత్రించడంలో అడ్డసరం మొక్క బహుళ ప్రయోజనాలు:
దోమల ద్వారా సంక్రమించే వ్యాధులతో పోరాడడంలో అడ్డసరం మొక్క ( అడతోడా వాసిక ) ఆయుర్వేదoలో ఒక అద్భుతమైన ఔషదo. దోమలను నియంత్రించగల సామర్ధ్యం కూడా ఈ మొక్క కు వుంది. ఇది సులభంగా పెరగగలదు. ప్రముఖ ఆయుర్వేద వైద్యులు డా. సురేష్ జకోటియా గారు దీన్ని నాకు పరిచయం చేసారు.
అడ్డసరం మొక్క వల్ల కలిగే బహుళ ప్రయోజనాలు :
1. అడ్డసరం ఆకులు దోమల నిరోదకాలుగా( Repellant) పని చేస్తాయి. ఖమ్మం మునిసిపల్ కార్పోరేషన్ వెనుక వున్న పార్క్ లో భారీ సంఖ్యలో ఈ మొక్కలు నాటడంతో ఒక్క దోమ కూడా కార్యాలయ ఆవరణలో కనిపించలేదు. ఒకే సారి దాదాపు 1,50,000/- కొమ్మలు ఖమ్మం మునిసిపల్ కార్పోరేషన్ లో పంపిణీ చేయడం జరిగింది. (గులాబి తరహాలో అడ్డసరం కొమ్మలు కూడా నాటుకొని మొక్కలుగా పునరుత్పత్తి అవుతాయి). అవి మొక్కలుగా ఎదిగిన తర్వాత దోమల సంఖ్య క్షీణించి సత్ఫలితాలనిచ్చాయి.
2. దోమల లార్వా పెరగకుండా చేయడంలో అడ్డ సరం ఆకులు తోడ్పడతాయి. అడ్డసరం ఆకులను నలిపి సరైన నిష్పత్తిలో నిలువ వున్న నీటిలో వేసినట్లయితే దోమలను లార్వా దశలోనే నిర్మూలిస్తాయి. సూర్య పేట లో విజయవంతంగా పరీక్షించి చూడడం జరిగింది. ఖమ్మం లో కూడా జిల్లా మలేరియా అధికారి శ్రీ రాంబాబు గారి సమక్షం లో పరీక్షించడం జరిగింది.
3. వ్యాధి నివారణ ఔషదంగా కూడా అడ్డసరం ఆకులను వాడవచ్చు. హోమియో వైద్యం లో అడ్డసరం ఆకులను ఉపయోగిస్తారు. మూడు నుండి ఐదు రోజుల పాటు అడ్డసరం ఆకులను వాడితే వ్యాధి నివారణా ఔషదంగా పని చేస్తుందని ఆయుర్వేదం లో చెప్పబడింది. ( ఎంత పరిమాణం లో వాడాలో , ఏ సమయంలో వాడాలో , ఎంత కాలం వాడాలో నిపుణుల సలహా తీసుకోవాలి).
4. చికున్ గున్యా తగ్గినా దాని వలన వచ్చిన నొప్పులు తగ్గవు. అయితే అడ్డసరం ఆకులు ఉడికించిన నీటిని (అడ్డసరం ఆకులు వేసిన నీటిని వేడి చేసిన తరువాత ఆకులను తీసివేయాలి) సేవించి చికున్ గున్యా ద్వారా వచ్చిన నొప్పులు తగ్గించుకున్న వ్యక్తిని నేను చూసాను.
5. నీటిని శుద్ధి చేయగల గుణం కూడా దీనికి వుంది.
6. దీన్ని వాడడం వలన ఊపిరి తిత్తులు కూడా బలోపేతం అవుతాయి. ఇతర దోమల నిరోధకాలు ఊపిరితిత్తులకు నష్టం కలిగిస్తే అడ్డసరం మాత్రం దోమలను నివారించి చంపడం తో పాటు ఊపిరి తిత్తులతో సహా మానవ శారీరక వ్యవస్థను బలోపేతం చేస్తుంది.
అడ్డసరం ను పెంచడం : ఒక కొమ్మను నాటుకొని అడ్డసరం మొక్కను సులభంగా పెంచుకోవచ్చు. మూడు గనెలు(nodes) ఉన్న కాండం అయితే మంచిది. ఆకులు లేనిదైనా నాటు కోవచ్చు. కొద్ది రోజుల్లోనే చిగురు కనిపిస్తుంది. చిగురుటాకులు కనిపించేంత వరకు జాగ్రత్తలు తీసుకోవాలి. పేరు తెలియని ఒక మహానుభావుడు భారీ సంఖ్యలో అడ్డసరం మొక్కలను భూ సరిహద్దులుగా నాటి పోషిస్తుండడం నేను చూసాను. నేను సూర్యాపేటలో కమీషనర్ గా పనిచేసినప్పుడు 20 వేల మొలకలు , ఖమ్మం లో ఉన్నప్పుడు 1,50,000 మొలకలు పంపిణీ చేయడం జరిగింది. క్రోటన్స్ బదులుగా అన్ని పార్కుల్లోనూ అడ్డసరం మొక్కలనే నాటడం జరిగింది.
అడ్డసరం తో వాతావరణ మార్పుల దుష్ప్రభావాన్ని క్షీణిoపజేయడం :
1. కాలుష్యానికి ప్రధాన కారణాల్లో దోమల పెరుగుదల ఒకటి. అడ్డసరం దోమలను , దోమల ద్వారా సంక్రమించే వ్యాధులను అరికడుతుంది. తద్వారా వాతావరణ మార్పును కూడా అదుపులో ఉంచుతుంది.
2. ఇతర వ్యాధులను నివారించడంతో పాటు ఔషదాల అవసరాన్ని తగ్గిస్తుంది.
3. అడ్డసరంకు నీటిని శుద్ధి చేసే సామర్ధ్యం వున్నoదున నీటి కాలుష్యాన్ని కూడా నివారిస్తుంది.
బహుళ ప్రయోజనాలు కలిగి వున్న ఈ మొక్క విశిష్టతను దృష్టిలో వుంచుకొని శారదా నగర్ వాటర్ ట్యాంక్ ఆవరణలోని ఔషద మొక్కల నర్సరీలో రామగుండం నగర పాలక సంస్థ ఈ మొక్కలను ప్రజలకు ఉచితంగా అందించడానికి అబివృద్ది చేస్తోంది. అన్ని పని దినాల్లో ఉదయం 8 నుండి 10.00 గంటలు మరియు మధ్యాహ్నం 3 .00 నుండి 5.00 గంటలవరకు శారదా నగర్ నర్సరీ నుండి ఎవరైనా ఉచితంగా ఈ మొలకలను తీసుకు వెళ్లి నాటుకోవచ్చు. కావున వ్యాధిగ్రస్తులు, ఆసక్తి వున్నవారు రామగుండం నగర పాలక సంస్థ అందిస్తున్న ఈ సదవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరుతున్నాము :
బోనగిరి శ్రీనివాస్
కమీషనర్
రామగుండం నగర పాలక సంస్థ.
Share it with other groups and individuals of Ramagundam city. For similar articles visit my website sbkashyapaeco.com.